అమాయకులను బలి చేస్తే చూస్తూ ఊరుకోమంటున్న చినరాజప్ప!

ఇటీవలే కోనసీమ జిల్లాలో అనంతపురంలో జరిగిన అల్లర్ల గురించి ఇప్పటికీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ విషయం గురించి తాజాగా మాజీ హోంమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ కొన్ని విషయాలు బయటపెట్టారు. అమలాపురంలో జరిగిన అల్లర్ల సంఘటనలో పోలీసులు, ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉందని అన్నారు.

ఈ ఘటనకు పాల్పడిన వారిపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలి అని, అల్లర్ల ఘటనలో వైసీపీవారు చెప్పారని అమాయకులను బలి చేస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు. ఇక రైతులు అమ్ముకున్న ధాన్యం కు డబ్బు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని.. తమ నష్టాలను భరించలేక పంట విరామం చేస్తున్నారు అని.. వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళితే తరిమి తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.