తన ప్రతి అడుగులో ఆయన తోడుగా ఉన్నారంటున్న ముఖ్యమంత్రి జగన్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. తాజాగా ఆయన నెల్లూరులో గౌతమ్ రెడ్డి సంస్మరణ సభలో పాల్గొని ఆయనకు నివాళులు అర్పించాడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలిపాడు. తన ప్రతి అడుగులో గౌతమ్ రెడ్డి తోడుగా ఉన్నారని.. ప్రతిఒక్క విషయంలో ప్రోత్సహించేవారని అన్నాడు.

ఆయనను.. తనే రాజకీయాల్లోకి తీసుకువచ్చానని తెలిపాడు. ఇక తమ పరిశ్రమ శాఖ లో ఆరు విభాగాలను గౌతమ్ రెడ్డి చూసేవారిని.. ఆంధ్రప్రదేశ్ కు పరిశ్రమలు తేవాలన్న తపన ఆయనలో చాలా ఉండేదని అన్నారు. ఒక మంచి స్నేహితుడిని కోల్పోయానని బాధపడుతూ.. సంగం బ్యారేజ్ కు మేకపాటి గౌతమ్ రెడ్డి బ్యారేజ్ అని పెడతామని ప్రకటించాడు.