రామ్ గోపాల్ వర్మపై నమోదైన చీటింగ్ కేసు..

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక విషయం తో సంచలనంగా మారుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈయన పై చీటింగ్ కేసు నమోదయింది. గతంలో రామ్ గోపాల్ వర్మ శేఖర్ రాజు అనే వ్యక్తి దగ్గర దిశ సినిమా నిర్మించేందుకు 56 లక్షల తీసుకున్నట్లు తెలిసింది.

దీంతో ఆ సినిమా విడుదలైన తర్వాత కూడా డబ్బులు ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడటంతో తాజాగా మియాపూర్ పోలీస్ స్టేషన్ లో అతడిపై కేసు నమోదు చేశాడు. దీంతో వర్మపై 406, 417,420,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు విచారిస్తున్నారు.