బాలసుబ్రహ్మణ్యం గారి ప్రస్థానం ఒక స్వర్ణ యుగం: చంద్రబాబు నాయుడు

సినీ పరిశ్రమకు చెందిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన కూడా ఆయనను ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటాం. ఎందుకంటే ఆయన తన పాటలతో ఎంతో మంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్నారు. ఇక ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా సినీ ప్రముఖులతో పాటు ఆయనను ఆదరించేవారంతా ఆయన జయంతి సందర్భంగా స్మరించుకుంటున్నారు.

ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఆయనను గుర్తుకు చేసుకున్నారు. సినీ సంగీత చరిత్రలో గాయకుడిగా, సంగీత దర్శకుడిగా బాలసుబ్రహ్మణ్యం గారి ప్రస్థానం ఒక స్వర్ణ యుగం అని అన్నారు. ఎన్నో పాటలను ఆలపించి ఆబాలగోపాలాన్ని మంత్రముగ్ధులను చేశారు అని.. ఆ మధుర గాయకుని జయంతి సందర్భంగా కళారంగ సేవలను స్మరించుకుందాం అని అన్నారు.