కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో బలపడాలంటే దానికి ఒకే ఒక్క అవకాశం టీడీపీ అధినేత చంద్రబాబు. ఎటూ, తెలుగుదేశం పార్టీ, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో తీవ్రంగా దెబ్బ తినేసిన దరిమిలా, ఇద్దరూ కలిస్తే.. ఇద్దరికీ మేలు.. అన్న భావనతో కాంగ్రెస్ అధిష్టానం వుందట. నిజానికి, కాంగ్రెస్ పార్టీ.. చంద్రబాబుకి కొత్తేమీ కాదు. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు కూడా. 2019 ఎన్నికల సమయంలో అధికారికంగా జత కట్టకపోయినా, కాంగ్రెస్ పార్టీతో టీడీపీకి అవగాహన కుదిరింది అప్పట్లో. బీజేపీపై పోరులో భాగంగా కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు జతకట్టి, టీడీపీని మరింత నాశనం చేశారన్నది నిర్వివాదాంశం.
మరి, ఈసారి గనుక కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు జతకడితే, టీడీపీ ఏమవుతుందట.? ఏమోగానీ, చంద్రబాబుతో ఇప్పటికే కాంగ్రెస్ నేతల టీమ్ ఒకటి సంప్రదింపులు మొదలు పెట్టిందని అంటున్నారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు నేపథ్యంలో చంద్రబాబు, కాస్త అటువైపు చూపు మళ్ళించినా ఆశ్చర్యపోవాల్సిన పని వుండదేమో. వచ్చే ఎన్నికల నాటికి, కేంద్రంలో బీజేపీ పాలన పట్ల వ్యతిరేకత పెరుగుతుంది గనుక, ఆ నెగెటివ్ వేవ్.. కాంగ్రెస్ పార్టీకి కలిసొస్తుంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీతో జత కట్టడం మంచిదేనని, ఓ రాజగురువు.. ఓ బూతు కిట్టు.. చంద్రబాబుకి తాజాగా సలహా ఇచ్చారట. ఆ సలహా ప్రకారమే చంద్రబాబు, కాంగ్రెస్ వైపు చూసే అవకాశం వుందంటున్నారు. కానీ, అదంత తేలికైన వ్యవహారం కాదు. బీజేపీ పాలన పట్ల కొంత వ్యతిరేకత వస్తే రావొచ్చుగానీ, అది కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తుందని అనుకోలేం. ఎందుకంటే, కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపంతో బాధపడుతోంది.