Raja Sree Nayar: సినిమాలలో బిజీగా ఉన్నా.. సీరియల్స్‌లో నటించకపోవడానికి కారణం ఇదే..

Raja Sree Nayar: కెరియర్‌ చాలా బాగా ముందుకు వెళ్తోంది అనుకున్న సమయంలోనే తాను బ్రేక్ ఇచ్చేసి, ఆ తర్వాత సీరియల్స్ చేశానని ప్రముఖ ఆర్టిస్ట్ రాజశ్రీ నాయర్ అన్నారు. తనకు ఆ టైంలోనే వివాహం జరిగిందని, ఆ తర్వాత యూఎస్‌కు వెళ్లిపోయానని ఆమె చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తన కొడుక్కి 5ఏళ్లు రాగానే మళ్లీ తాను ఇక్కడికి వచ్చానని ఆమె అన్నారు. ఆ టైంలోనే తాను ఏదైనా చేయాలని అనుకున్నట్టు ఆమె తెలిపారు.

నిజం చెప్పాలంటే తనకు డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో చాలా ఇంట్రస్ట్ అన్న రాజశ్రీ నాయర్, ఫొటోగ్రఫీ కోర్సు కూడా చేశానని ఆమె అన్నారు. ఆ తర్వాత తాను గురువులా భావించే నారాయణరావును కలిసి తనకు ఏదైనా జాబ్ కావాలని అడిగినట్టు ఆమె తెలిపారు. ఆయన వెంటనే డైరెక్షన్‌ టీంలో జాయిన్ అవ్వమని చెప్పారు. కానీ యాక్టింగ్‌లో ఏదైనా ఉంటే చెప్పమని అడిగినపుడు జెమినీ టీవీలో కొత్త బంగారం అనే సీరియల్‌లో అవకాశం ఇచ్చారని ఆమె తెలిపారు.

అలా తనకు ఆ తర్వాత కూడా చాలా మంచి క్యారెక్టర్స్ చేసే అవకాశం వచ్చిందని, ఆ సీరియల్‌లోనే పోలీస్ పాత్ర చేశానని ఆమె అన్నారు. ఇకపోతే వయసు అవుతున్నా కొద్దీ పాత్రలు కూడా మారతాయని, మనకు వచ్చే పాత్రలు కూడా అలానే ఉంటాయని ఆమె చెప్పారు. సినిమాలు చేసేవాళ్లు సీరియల్స్ చేస్తే అవకాశాలు రావద్దని నిజమేనని, అందుకే తన మేనేజర్స్ కూడా చేయొద్దని చెప్తూ ఉంటారని ఆమె అన్నారు. నిజం చెప్పాలంటే సినిమా అయితే హ్యాపీ లైఫ్ అని, కొన్ని డైలాగ్స్ చెప్పి వస్తే అయిపోతుంది. కానీ సీరియల్స్ అంటే చాలా టయర్డ్ అయిపోతామని ఆమె చెప్పారు. అయినా తనకు అలా హార్డ్ వర్కింగ్ చేయమన్నా కూడా ఇబ్బందేమీ లేదని ఆమె స్పష్టం చేశారు. కానీ తాను వచ్చిందే అక్కడినుంచి అని ఎలా వదిలేయగలను అని ఆమె అన్నారు.