
బాలీవుడ్లో చాలా సింపుల్గా మల్టీ స్టారర్ మూవీస్ రూపు దిద్దుకుంటుంటాయి. కానీ, టాలీవుడ్లో అలా కాదు. అయితే, పరిస్థితులు మారాయి. ఇప్పుడు బిగ్ మల్టీ స్టారర్లకు టాలీవుడ్ కూడా వేదికవుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో ట్రపుల్ ఆర్ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. భారీ ఎక్స్పెక్టేషన్స్తో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.
కాగా, తాజాగా మరో భారీ మల్టీ స్టారర్కి రంగం సిద్ధమవుతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జోరుగా వినిపిస్తోంది. అదే రామ్ చరణ్, బన్నీ కాంబినేషన్ మూవీ. ఎప్పటి నుండో ఓ మల్టీ స్టారర్ మూవీలో నటించాలని బన్నీ అనుకుంటున్నాడట. కానీ, సెట్ కాలేదు. గతంలో ‘ఎవడు’ సినిమాలో బన్నీ, చరణ్ కలిసి నటించారు. కానీ, ఆ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్ సీన్లు లేవు.
ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోందట. క్రియేటివ్ డైరెక్టర్లు సుకుమార్, వంశీ పైడిపల్లి ఈ కాంబినేషన్ కోసం విడి విడిగా కథలు సిద్ధం చేస్తున్నారట. అయితే, ఎవరికి ఈ కాంబో సెట్ అవుతుందో తెలీదు. కానీ, త్వరలోనే ఈ కాంబినేషన్ సెట్ అవ్వడం పక్కా అంటున్నారు. బహుశా గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే ఈ ప్రాజెక్టు ఉండబోతోందనీ ఇన్సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం.
