అవి గ్రాఫిక్స్ బిల్డింగ్ ల‌ని దూకి నిరూపించండి! బుద్ధా కౌంటర్

వైకాపా ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి ట్విట‌ర్ వేదిక‌గా టీడీపీ నేత‌ల‌పై వేసే కౌంట‌ర్లు, విమర్శ‌ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ట్విట‌ర్ ని ఎలా వాడాలో? ఆయ‌న‌కు తెలిసినంత‌గా మ‌రో నేత‌కు తెలియ‌దేమో! అన్న‌ట్లుగా వాడేస్తుంటారు. రాజ‌కీయ నాయ‌కుల్లో ట్విట‌ర్ సెల‌బ్రిటీగా విజ‌య‌సాయి బాగా పాపుల‌ర్ అయ్యారు. రాజ‌ధాని త‌ర‌లింపు విష‌యంలో ఇప్ప‌టికే పలుమార్లు హీటెక్కించే ట్వీట్ల‌తో విజ‌య‌సాయి విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. చంద్ర‌బాబు నాయుడు విజ‌య‌వాడ‌లో గ్రాఫిక్స్ బిల్డింగ్ లు చూపించి జ‌నాల్ని ప‌చ్చిగా మోసం చేస్తున్నారంటూ చాలాసార్లు విమ‌ర్శించారు.

తాజాగా అదే ట్విట‌ర్ వేదిక‌గా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న విజ‌య‌సాయిపై విరుచుకుప‌డ్డారు. య‌శ్రారైకాపా( యువ‌జ‌న శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ) ఎంపి విజ‌య‌సాయికి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. అమ‌రావ‌తి గ్రాఫిక్స్ అంటూ ట్వీట్ చేసిన సాయిరెడ్డి గారికి ద‌మ్ముంటే అమ‌రావ‌తిలో చంద్ర‌బాబు గారు క‌ట్టిన భ‌వ‌నంపై నుంచి దూకి గ్రాఫిక్స్ అని నిరూపించారు. మూడు ముక్క‌లాట మొద‌లెట్టి ఒక్క ఇటుక కూడా మొద‌లు పెట్ట‌లేదు‌. మీరా? విశాఖ‌లో అద్భుత‌నగ‌రాన్ని నిర్మించేద‌ని బుద్ధా విమ‌ర్శించారు. బ్లూ మీడియాలో గ్రాఫిక్స్ జ‌నాన్ని పెట్టినంత ఈజీ కాదు రాజ‌ధాని నిర్మాణం అంటే విజ‌య్ సాబ్.

మీరు ఎప్పుడు వ‌స్తారో చెబితే మీడియాతో స‌హా బిల్డింగ్ క్రింద వెయిట్ చేస్తాన‌ని ట్వీట్ చేసారు. మ‌రి బుద్దా ట్వీట్ పై విజ‌య‌సాయి ఎలా స్పందిస్తారో? చూడాలి. సాధార‌ణంగా టీడీపీ ఎలాంటి విమ‌ర్శ‌లు చేయ‌క‌పోయినా విజ‌య‌సాయి ట్విట‌ర్లో అదే ప‌నిగా చంద్ర‌బాబు నాయుడు, లోకేష్ ని ఉద్దేశించి ట్వీట్లు చేస్తుంటారు. అలాంటింది బుద్దా ప‌నిగ‌ట్టుకుని మ‌రీ ట్వీట్ చేసారు. కాబ‌ట్టి సీన్ లోకి విజ‌య‌సాయి ఎందుకు దిగ‌కుండా ఉంటారు. ఇటీవ‌ల కాలంలో ప‌రిపాల‌న రాజ‌ధానిగా ప్ర‌క‌టించి విశాఖ‌పై టీడీపీ విషం చిమ్ముతుంద‌ని ప్ర‌చారం సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. విశాఖ‌లో జ‌రుగుతోన్న వ‌రుస ప్ర‌మాదాల వెనుక టీడీపీ ఉంద‌ని వైకాపా ఎమ్మెల్యేలు, విజ‌య‌సాయి ఆరోపించారు.