Crime: పెళ్లి పందిట్లో విషాదం.. జీలకర్ర, బెల్లం పెట్టబోతున్న సమయంలో కుప్పకూలిన నవ వధువు..?

Crime: సాధారణంగా పెళ్లి అంటే ఆ ఇంట్లో వాతావరణం ఎంత సందడి సందడిగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. అలాంటి పెళ్లి వేడుకలో జరగరానిది ఏమైనా జరిగితే ఆ బంధువులు కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతం. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. విశాఖ జిల్లాలోని మధురవాడ లో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. పెళ్లి పందిట్లో అందరూ ఆనందంగా సంతోషంగా గడుపుతున్నారు. అంతేకాకుండా మరికొద్ది సేపట్లో వివాహ తంతు కూడా ముగుస్తుంది అనుకుంటున్న సమయంలోనే ఒక్కసారిగా తీవ్ర విషాదం నెలకొంది.

సరిగ్గా జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో పెళ్లికూతురు ఒక్కసారిగా కుప్పకూలింది. నవ వధువు స్పృహ కోల్పోవడంతో ఆందోళన చెందిన బంధువులు కుటుంబ సభ్యులు వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తాజాగా ఆమె మృతి చెందింది. పెళ్లి వేడుకతో రెండు కుటుంబాలు ఎంతో సంతోషంగా గడపాల్సిన సమయంలో నవ వధువు మృతి చెందడంతో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. బాజాభజంత్రీలు ముగించాల్సిన ఇంట్లో చావు కేకలు వినిపించడంతో ఆ ఘటన స్థానికంగా కలకలం రేపింది.