Breaking Dil Raju : గత కొన్నాళ్ల నుంచి కూడా ఏపీ లో టికెట్ ధరలకు సంబంధించి టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందో అందరికీ తెలిసిందే. ఊహించని రీతిలో సంచలన ప్రెస్ మీట్ లు నోట్ లు, ఇలా అనేక యాగీ అనంతరం నిన్న ఫైనల్ గా సరికొత్త జీవో ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.
దీనితో మెగాస్టార్ చిరంజీవి వారి ధన్యవాదాలు తెలియజేయగా ఇప్పుడు టాలీవుడ్ వన్ ఆఫ్ ది టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దిల్ రాజు తన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై కీలక ట్వీట్స్ చెయ్యడం ఆసక్తిగా మారింది.
మొదట ఏపీ ప్రభుత్వం సీఎం జగన్ మరియు మంత్రి పేర్ని నానీలు థాంక్స్ చెప్పారు. ఈ కష్ట సమయంలో టాలీవుడ్ కోసం కొత్త జీవో ని విడుదల చేయడం ఆనందదాయకం అని తెలిపారు. అలాగే తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ మరియు మంత్రి తలసాని కోసం అయితే ఒకింత ఎక్కువే చెప్పారు.
తెలంగాణా లో 5 షోలకు అనుమతులు ఇవ్వడం అనేది పెద్ద సినిమాలకు నిజంగా ఒక మేజర్ స్టెప్ అని ఇలాంటి పెద్ద నిర్ణయం తీసుకున్నందుకు గాను ఇద్దరికీ తమ బ్యానర్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టుగా దిల్ రాజు తెలిపారు. దీనితో ఈ రెండు ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.
https://twitter.com/SVC_official/status/1501045998969368576?s=20&t=nUXFm6V460Qg-QHoyUCoLw
