రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల విక్రయాలపై యాక్షన్ ప్లాన్ సిద్ధమైన సంగతి తెలిసిందే. తొలి విడతగా విశాఖ, గుంటూరు జిల్లాలలో కలిపి 9 చోట్ల ప్రధాన ప్రాంతాల్లోని విలువైన భూముల్ని ఈ వేలం వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ భూములు ద్వారా సుమారు 300 కోట్లు వరకూ ఆదాయం రావొచ్చని అంచనా వేస్తున్నారు. నవరత్నాలు, నాడు -నేడు వంటి ప్రభుత్వ పథకాల అమలుకు ఈ నిధులు వెచ్చిస్తామని బిల్డ్ ఏపీ మిషన్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. అయితే తాజాగా బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వం కుట్ర చేస్తుందని టీడీపీ నేత బోండా ఉమ ఆరోపించారు.
అధికార పక్షం తమ వాళ్లకు భూములు దోచి పెట్టడానికే అమ్మకానికి జీవో ఇచ్చారని మడిపడ్డారు. ప్రభుత్వ భూముల్ని అమ్మడాన్ని అడ్డుకుంటామని..ఎవరైనా భూములు కొంటే తిరిగి మళ్లీ తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని లాక్కుంటుమాని బెదిరించారు. గత ప్రభుత్వాలు ఇలాగే ప్రభుత్వ భూములు అమ్మాయా? అని ప్రశ్నించారు. దీంతో బోండాపై వైకాపా నేతలు అదే స్థాయిలో విరుచుకు పడ్డారు. మేము భూములు అమ్మి రాష్ర్ట ప్రజలకు మంచి పనులు చేయాలనుకుంటున్నాం. మీలా దోచేయాలనుకోవడం లేదు.
మీలా నాయకులకో? బంధువులకో కట్టబెట్టాలనుకోవడం లేదని, పద్దతి ప్రకారం ఈ వేలం వేసి అమ్ముతున్నామన్నారు. అమరావతిలో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కొని , వాళ్ల పొట్టలు కొట్టలేదని ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాష్ర్టంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో! ఆ మాత్రం తెలయకుండానే రాజకీయాలు చేసేస్తున్నావా? ఎంత అహంకారం ఉంటే ప్రభుత్వ భూముల్ని కొన్నవారి నుంచి లాక్కుంటానంటావు? నీ బెదిరింపులు, నీ రౌడీయిజం మీ పార్టీ నేతలతో చేయ్ అంటూ వైకాపా నేతలు మండిడ్డారు.