మేజర్ సినిమా పై స్పందించిన బాలీవుడ్ బిగ్ బీ… మహేశ్ బాబు రియాక్షన్ ఇదే?

అడివి శేష్ హీరోగా నటించిన మేజర్ సినిమా ఇటీవల విడుదలై మంచి పాజిటివ్ టాక్ తో ముందుకూ దూసుకుపోతోంది. ముంబైలో జరిగిన టెర్రరిస్ట్ దాడుల్లో అమరులైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా ఊహించని రీతిలో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. శశి కిరణ్ తిక్క ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై, మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమా నిర్మించాడు. సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సినిమా రిలీజ్ కి ముందే పలు ప్రముఖ నగరాలలో ప్రీమియర్ షో వేశారు. ఈ షో చూసిన సెలెబ్రెటీలతో పాటు ప్రేక్షకులు నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

మేజర్ సినిమా జూన్‌3 వ తేదీన తెలుగుతో పాటు హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలై మొదటిరోజు నుండి వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు కూడా సినిమా మీద ప్రశంశలు కురిపించారు. ఈ క్రమంలో బాలీవుడ్ బగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా ఈ సినిమా మీద ప్రశంసలు కురిపించాడు. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేస్తూ ” మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా మేజర్‌ సినిమా తెరకెక్కింది. ఆయన ముంబై దాడుల్లో ఎంతోమందిని రక్షించి అమరులయ్యారు. సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథను అద్భుతంగా తెరకెక్కించారు. చిత్రబృందానికి నా బెస్ట్‌ విషెస్‌’ అంటూ మహేష్ బాబు, హీరో అడివి శేష్ కి టాగ్ చేశాడు.

బాలీవుడ్ స్టార్ హీరో అయినా అమితాబచ్చన్ మేజర్ సినిమా గురించి స్పందించడంతో హీరో అడవి శేషు మరియు మహేష్ బాబు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అమితాబచ్చన్ లాంటి గొప్ప వ్యక్తి స్పందించడం చాలా గొప్ప విషయం. బాలీవుడ్ లెజెండ్ స్వయంగా ట్వీట్ చేశారు..అంటూ అడవి శేషు రిప్లై ఇచ్చాడు. ‘మీ ఎంకరేజ్‌మెంట్‌కు ధన్యవాదాలు’ అని మహేశ్‌ బాబు రిప్లై ఇచ్చాడు. మేజర్ సినిమా విడుదలైన మొదటి రోజు నుండే హిట్ టాక్ సొంతం చేసుకుని వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.13.10 కోట్ల గ్రాస్‌ సాధించిన ఈ చిత్రం వారం రోజుల్లోనే రూ.50.7 కోట్ల గ్రాస్‌ రాబట్టింది.