కాంగ్రెస్ పార్టీ తనపై బురద చల్లుతుందంటున్న రఘునందన్..

భాజపా ఎమ్మెల్యేల రఘునందన్ తాజాగా మీడియా ముందు కొన్ని విషయాలు బయట పెట్టారు. ఈయన ప్రెస్ మీట్ లో జూబ్లీహిల్స్ ఘటన వీడియోని ప్రదర్శించారు అంటూ పోలీస్ స్టేషన్లో ఈయనపై కేసు నమోదయిన సంగతి తెలిసిందే. దీంతో అతడు తాజాగా మాట్లాడుతూ.. ఆ ఘటనపై నిర్వహించిన ఆ బాలికకు సంబంధించిన వివరాలు తాను చెప్పలేదని అన్నారు.

తాను న్యాయవాదినే అంటూ.. తనకు చట్టం తెలుసు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కావాలనే తనపై బురద చల్లుతుందని అన్నారు. తానెప్పుడూ బాధితురాలి వైపునే మాట్లాడుతున్నాను అంటూ.. ఎంఐఎంఐ ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ కి ఏమవుతుంది అని అన్నారు. ఇదంతా కక్షసాధింపు చర్యల్లో భాగంగా తనపై కేసు వేసారు అని అన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే పోలీసులు ఆ వీడియో తీసిన వాళ్ళ పై కేసు పెట్టాలి అని అన్నారు.