సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న బిత్తిరి స‌త్తి ప్యాకేజ్..!

బిత్తిరి స‌త్తి ఈజ్ బ్యాక్.. ప్ర‌ముఖ తెలుగు మీడియా సాక్షి టీవీలో తాను పని చేయబోతున్నట్టు తెలిపిన సత్తి, ఇక‌ముందు స‌త్తిగాని స‌త్తా ఏంటో చూపిస్తానంటూ ఒక శ్యాంపిల్ ప్రోమో విడుద‌ల చేసి, మ‌రోసాని ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. ఇక వీ6 చానల్‌లో తీన్మార్, ఆ తర్వాత టీవీ9లో ఇస్మార్ట్ న్యూస్ వంటి వెరైటీ కామెడీ షోలతో ప్రేక్షకులను అల‌రించిన బిత్తిరి సత్తి, ఇప్పుడు సాక్షీలో సెటైరికల్ కామెడీ షోను చేయబోతున్న‌ట్లు స‌మాచారం.

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే..దాదాపుగా 6.5 లక్షల రూపాయల ప్యాకేజ్‌తో, సాక్షి వారితో బిత్త‌రి స‌త్తి డీల్ కుదుర్చుకున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు జోరుగా ప్ర‌చారం అవుతున్నాయి. దీంతో ఇప్పుడు బిత్తిరి స‌త్తి ప్యాకేజ్ సోష‌ల్ మీడియాలో వైర్మల్ అవుతుండ‌గా, మీడియా వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతుంది. ఇక వి6 చాన‌ల్‌లో తీర్మార్ ప్రోగ్రామ్‌తో, ఓ రేంజ్‌లో ఫాలోయింగ్ సంపాదించిన బిత్తిరి స‌త్తి, అనూహ్యంగా టీవీ9 చాన‌ల్‌కి మారారు. అక్క‌డ చేసిన ఇస్మార్ట్ న్యూస్ ప్రోగ్రామ్ అంత‌గా పేల‌క‌పోవ‌డం, ఆ చాన‌ల్ యాజ‌మాన్యంతో ఏర్పడిన మనస్పర్దల కారణంగా, టీవీ9 నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన బిత్తిరి స‌త్తి, ఇప్పుడు కొత్త‌గా సాక్షిలో త‌న కొత్త ప్ర‌యాణం మొద‌లుపెట్ట‌నున్నాడు.