Biggest Update: ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మళ్లీ ఆడియెన్స్ క్రేజీ గా ఎదురు చూస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది మెగాస్టార్ చిరంజీవి మరియు మెగాస్టార్ వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా బ్లాక్ బస్టర్ విజయాలు దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “ఆచార్య” కూడా ఒకటి.
ఈ మెగా మాసివ్ మల్టీస్టారర్ కోసం ఆడియెన్స్ మరియు మెగా ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తుండగా దాని కన్నా ముందు ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తి తో చూస్తున్నారు. అయితే ఈరోజు ఈ భారీ అప్డేట్ ని అందిస్తున్నట్టు ఈరోజు ఉదయం ప్రకటించారు. ఇప్పుడు దీనికి డేట్ ని ఖరారు చేసి మెగా మాస్ అనౌన్స్మెంట్ ఇచ్చారు.
ఈ ట్రైలర్ ని ఈ ఏప్రిల్ 12న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. అలాగే ఈ సినిమా పోస్టర్ చూస్తే అది మరింత అంచనాలు పెంచేదిలా ఉందని చెప్పాలి. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా ఈ సినిమాలో పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్ లు హీరోయిన్ లుగా నటించగా మణిశర్మ సంగీతం అందించారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఏప్రిల్ 29న విడుదల కి సిద్ధంగా ఉంది.
