Mahesh Babu: మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా నుంచి భారీ అప్డేట్… మహేష్ తో పోటీ పడనున్న బాలీవుడ్ స్టార్?

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారీ వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నారు. అన్ని అనుకున్న విధంగా జరిగి ఉంటే ఈ పాటికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. మహేష్ బాబు మోకాలి సర్జరీ చేయించుకోవడం, కరోనా బారిన పడటం వల్ల ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యం అవుతోంది. ఈ సినిమా త్వరగా పూర్తిచేసి వేసవి సెలవుల్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.ఈ సినిమా తరువాత మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరొక సినిమా చేయనున్న సంగతి మనకు తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబుతో పోటీ పడటం కోసం బాలీవుడ్ స్టార్ హీరోని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.

త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి విలన్ గా నటిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ముందుగా ఈ చిత్రంలో విలన్ గా నటించడం కోసం కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ సంప్రదించినట్లు వార్తలు వస్తున్నప్పటికీ ఈ సినిమాలో మాత్రం బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టిని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ విషయం గురించి చిత్రబృందం అధికారిక ప్రకటన చేయనున్నారు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో అతడు, ఖలేజా వంటి చిత్రాలు ఈ క్రమంలోనే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.