ఆ కాంగ్రెస్ నేత త్వరలో బీజేపీ లో చేరుతారని క్లారిటీ ఇచ్చిన బండి సంజయ్..

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ హవా ఎక్కువగా నడుస్తుంది. రానున్న ఎన్నికలో ఎలాగైనా తాము గెలుస్తామని సవాల్ విసురుతున్నారు. అంతేకాకుండా ఇతర పార్టీలకు చెందిన నాయకులు కూడా బీజేపీ పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారు. ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేరుతున్నట్లు తెలిసింది. ఈ విషయం గురించి బీజేపీ చీఫ్ బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే కేంద్ర మంత్రి అమిత్ షా తో రాజాగోపాల్ రెడ్డి భేటీ అయ్యారని అన్నారు.

త్వరలోనే ఆయన తమ పార్టీలో చేరడం ఖాయమని అన్నారు. అంతేకాకుండా తెరాస లో తిరుగుబాటు ఖాయమని అన్నారు. ఇక నల్గొండ, ఖమ్మం నుండి తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇక బీజేపీకి రాష్ట్ర ప్రజలు తప్పకుండా అధికారం కట్టబెడతారని అన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.