Balineni: జనసేనలో ఒంటరి అయిన బాలినేని… పార్టీ మారి తప్పు చేశారా!

Balineni: బాలినేని శ్రీనివాసరెడ్డి పరిచయం అవసరం లేని పేరు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈయన ప్రకాశం జిల్లాలో మంచి పేరున్న నాయకుడిగా గుర్తింపు పొందారు. స్వయంగా బాలినేని రాజశేఖర్ రెడ్డి గారికి బంధువు కావడంతో అక్కడ బాలినేని చెప్పిందే శాసనంగా ఉండేది. ఇక రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వైయస్ జగన్మోహన్ రెడ్డితో బాలినేని అడుగులు వేశారు.

జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈయన కీలక మంత్రి పదవులను తీసుకున్నారు. అయితే 2024 ఎన్నికలలో భాగంగా బాలినేని ఘోరంగా ఓటమిపాలు అయ్యారు. దీంతో ఈయన వైసీపీ పార్టీలో ఉండలేక తిరిగి జనసేన పార్టీకి వెళ్లిపోయారు అయితే జనసేన పార్టీకి వెళ్లిన ఈయనకు అక్కడ పెద్దగా ప్రాధాన్యత లభించలేదని తెలుస్తోంది. జనసేన పార్టీలోకి ముందు తనతో పాటు మరికొంతమంది ప్రకాశం జిల్లాకు చెందిన కీలక నేతలను తిరిగి జనసేనలోకి తీసుకువస్తానని బాలినేని చెప్పినట్టు సమాచారం.

ఇకపోతే బాలినేని శ్రీనివాస్ రెడ్డి తిరిగి జనసేన పార్టీలోకి వెళ్లటాన్ని వైసిపి నేతలు జీర్ణించుకోలేకపోయారు . ఈ క్రమంలోనే తాము వైసీపీ పార్టీని వదిలి రామని చెబుతున్నారు. ఇలా బాలినేని జనసేన పార్టీలోకి వెళ్లిన తర్వాత ఇప్పటివరకు ఒక్కరిని కూడా తిరిగి జనసేన పార్టీలోకి తీసుకోలేకపోయారు. దీంతో అక్కడ బాలినేని పట్టించుకునే వారే లేరని ఈయన ప్రస్తుతం ఆ పార్టీలో ఒంటరి అయ్యారని తెలుస్తోంది.

ఇలా ఎంతో గౌరవంగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ నుంచి జనసేనకు వెళ్లడంతో అక్కడ ఒంటరిగా మిగిలిపోయారు. ఇకపోతే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కువగా వినపడుతుంది ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోలేక పోతోంది ఇలాంటి తరుణంలోని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో వైసిపి నుంచి జనసేనలోకి వెళ్లడానికి ప్రకాశం జిల్లా నేతలు ఎవరు కూడా ఆసక్తి చూపించలేదు. మరి ప్రస్తుతం జనసేనలో ఒంటరిగా మిగిలిపోయిన బాలినేని జనసేన లోనే కొనసాగుతారా లేదా 2029 ఎన్నికల నాటికి సొంత గూటికే చేరుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.