గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నంత మాత్రాన ఆచారాలను మర్చిపోను… ట్రోల్స్ పై స్పందించిన ప్రణీత?

సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు పెద్ద ఎత్తున సెలెబ్రిటీలపై దారుణమైన కామెంట్లతో భారీగా ట్రోల్ చేస్తున్నారు. ఇకపోతే నటి ప్రణీత ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.తెలుగులో పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రణీత ప్రస్తుతం వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. తాజాగా ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ప్రణీత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండి మాతృత్వాన్ని అనుభవిస్తున్నారు.

ఇకపోతే గత అమావాస్య రోజున ఈమె భీమన అమావాస్య పూజ చేసి అనంతరం తన భర్త పాదాలకు నమస్కరించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో కొందరు ఈమె ఇప్పటికీ ఆచారాలను ఎంతో చక్కగా పాటిస్తుంది అంటూ పాజిటివ్ గా స్పందించగా మరికొందరు మాత్రం ఇంకా ఏ కాలంలో ఉన్నావు తల్లి ఇలా భర్త కాళ్లకు మొక్కుతున్నావు అంటూ నెగిటివ్ కామెంట్లతో రెచ్చిపోయారు.

ఈ క్రమంలోనే తన భర్తకు పాద పూజ చేసినందుకు తన గురించి వచ్చిన ట్రోల్స్ పై ప్రణీత స్పందిచారు. మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని రెండు కోణాల్లో చూస్తుంటాము. ఒకటి పాజిటివ్ గా రెండవది నెగిటివ్ గా చూస్తున్నారు. ఇలాంటి వాటిని తాను పట్టించుకోనని తాను ఒక గ్లామర్ ఫీల్డ్ లోకి వచ్చినప్పటికీ ఆచార సాంప్రదాయాలను మర్చిపోనని, నేను చిన్నప్పటి నుంచి ఇలాంటివి చూస్తూ పెరిగాను. గత ఏడాది కూడా నా భర్తకు ఇలాగే పాదపూజ చేశాను,నేనెప్పుడూ పద్ధతి కలిగిన అమ్మాయి లాగే ఉన్నానని తాను ఆచార సాంప్రదాయాలను గౌరవిస్తానని ప్రణీత తెలిపారు. మోడ్రన్ గా మారడం అంటే మనం నడిచి వచ్చిన దారిని మర్చిపోవడం కాదని అర్థం అంటూ ఈమె ట్రోల్స్ పై స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు.