బ్రేకింగ్: ఎన్నికల సంఘం ఉద్యోగుల సీఐడీ దర్యాప్తుపై హైకోర్టు స్టే

AP High court imposes stay on election commission issue

ఎన్నికల సంఘం అంశంపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈసందర్భంగా ఎన్నికల సంఘం అంశంపై సీఐడీ దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి కోర్టు వాయిదా వేసింది.

AP High court imposes stay on election commission issue
AP High court imposes stay on election commission issue

ఎన్నికల కమిషన్ ఉద్యోగుల పిటిషన్ తో పాటు సాంబమూర్తి పిటిషన్ ను కూడా ఒకేసారి విచారిస్తామని కోర్టు వెల్లడించింది. ప్రభుత్వం కౌంటర్ వేసేంతవరకు తదుపరి చర్యలు నిలిపివేయాలంటూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక.. ఎన్నికల కమిషన్ తరుపున సీనియర్ న్యాయవాది సీతారామమూర్తి వాదనలు వినిపించగా… సాంబమూర్తి తరుపున అశ్విన్ కుమార్ వాదనలు వినిపించారు.