దావోస్ టూర్ ముగించుకున్న వైయస్ జగన్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజుల కిందట దావోస్ పర్యటన చేసిన సంగతి తెలిసిందే. అక్కడ పారిశ్రామిక పెట్టుబడుల గురించి కొన్ని చర్చలు కూడా చేశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులు కూడా జరిగాయి. ఇక ఆ సదస్సుకు హాజరైన ఏపీ ప్రతినిధి బృందానికి స్వయంగా జగన్ నేతృత్వం వహించారు.

ఇక ఈ నెల 26న ఈ పర్యటన ముగియగా.. మంగళవారం తన రాష్ట్రానికి చేరుకున్నారు. ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న జగన్ ను స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ స్వాగతం పలికారు. అంతేకాకుండా ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మంత్రి జోగి రమేష్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వామి శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తదితరులు ఆయనకు స్వాగతం పలికారు.