ఆదివారం విశాఖ పట్నంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. నగరంలో జరిగే మిలాన్-2022 వేడుకల్లో పాల్గొననున్నారు. అనంతరం ఐఎన్ఎన్ విశాఖ నౌకను జగన్ సందర్శించనున్నారు. ఇటీవల తూర్పు నౌకాదళ స్థావరంలోకి ఐఎన్ఎన్ నౌక వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇంటర్నేషనల్ సిటీ పరేడ్కు సీఎం జగన్ హాజరుకానున్నారు. సాయంత్రం ఆర్కే బీచ్లో జరిగే నేవీ పరేడ్లో సీఎం జగన్మోహన్రెడ్డి పాల్గొంటారు. తర్వాత తిరిగి ప్రత్యేక విమానంలో తిరిగి విజయవాడ చేరుకుంటారు