Samantha: సినీనటి సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ కేవలం వెబ్ సిరీస్ లలో మాత్రమే నటిస్తూ ఉన్నారు. ఇక ఈమె తెలుగులో అయితే విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి సినిమా ద్వారా చివరిగా వెండితెరపై తలుక్కుమన్నారు. ఇక ఈమె ఈ సినిమా తర్వాత ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వలేదు అనారోగ్య సమస్యల కారణంగా కొంత కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సమంత తిరిగి ఇండస్ట్రీలో యాక్టివ్ అవుతూ కేవలం వెబ్ సిరీస్ లలో మాత్రమే నటిస్తున్నారు తప్ప సినిమాలకు మాత్రం కమిట్ అవ్వలేదు.
ఈ క్రమంలోనే సమంతను వెండితెరపై ఎప్పుడు చూస్తామా అని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇలా సినిమాలకు సమంత దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. అయితే సమంత సోషల్ మీడియా వేదికగా ఎలాంటి చిన్న పోస్ట్ చేసిన ఖచ్చితంగా అది నాగచైతన్యను ఉద్దేశించే చేస్తుంటారు అంటూ అభిమానులు భావిస్తుంటారు.
తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా మరొక పోస్ట్ చేశారు. మనిషిగా మీరు ఒక స్థిరమైన జీవి కాదు. ఏదీ స్థిరంగా ఉండదు – మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండవచ్చు అంటూ సమంత పోస్ట్ చేయడంతో కచ్చితంగా సమంత ఈ పోస్ట్ నాగచైతన్ నేను ఉద్దేశించి చేశారు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. నాగచైతన్య నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత ఈమె సోషల్ మీడియాలో ఏ పోస్ట్ చేసిన కొందరు పరోక్షంగా చైతన్యమైన ఉద్దేశించి చేసింది అంటూ కామెంట్లో చేస్తుంటారు.
ఇక విడాకుల తర్వాత మొదటిసారి నాగచైతన్య తన విడాకుల గురించి మాట్లాడారు. విడాకులు తీసుకోవడం అనేది నేను రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదు. ఒకటికి 1000 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. నేను కూడా ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిని ఆ బాధ ఎలా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు. మేము ఎంతో గౌరవంగా బయటకు వచ్చి మా విడాకులను ప్రకటిస్తూ మాకు ప్రైవసీ కావాలని అడిగాము. చాలామంది అదొక ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకున్నారంటూ నాగచైతన్య కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.