జాతరలో తప్పిపోయిన అనుపమ బావ.. నేనే అంటూ వచ్చిన జబర్దస్త్ కమెడియన్..?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ వంటి కామెడీ షోలకు ఉన్న ప్రేక్షకాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే కొంతకాలం క్రితం ప్రారంభించిన శ్రీదేవి డ్రామా కంపెనీ షో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ లో సందడి చేస్తున్న కమెడియన్లు టీం లీడర్లు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఫుల్ హంగామా చేస్తున్నారు. ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఈ షో కి రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఇక సీనియర్ నటి ఇంద్రజ ఈ షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది. అయితే గత కొంతకాలంగా ఇంద్రజ స్థానంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి ఈ షోలో సందడి చేస్తోంది. జిమ్ వీడియోలో బాగా పాపులర్ అయిన ప్రగతి శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా తన కండలు చూపిస్తూ ఆది వంటి వారిని బెదిరిస్తోంది.

ఈవారం బోనాల స్పెషల్ పేరుతో ఒక స్పెషల్ ఈవెంట్ ని ప్లాన్ చేశారు. ఈ ఆదివారం ప్రసారం కాబోయే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలయింది. ఈ ఎపిసోడ్ లో కార్తికేయ 2 సినిమా టీం సందడి చేసింది. ఈ క్రమంలో హీరో నిఖిల్ తో పాటు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో పాల్గొన్నారు. ఇక ఈ షో లో నిఖిల్ మాట్లాడుతూ గతంలో ఇలాంటి జాతరలో నా మరదలు తప్పిపోయింది అని అనగానే అనుపమ కూడా జాతరలో మా బావ తప్పిపోయాడు అని చెబుతుంది. దీంతో జబర్థస్త్ కమెడియన్ ఇమాన్యుల్ వెంటనే అనుపమ బావ నేనే అంటూ వచ్చాడు. అంతేకాకుండా సీరియల్ ఆర్టిస్ట్ మహేశ్వరి భర్త కూడా అనుపమ బావ నేనే అంటూ రాగా.. ఈవిడ మీ మరదలు అయితే మరి ఆవిడ వరదల్లో కొట్టుకొచ్చిందా? అంటూ ఆది పంచ్ వేస్తాడు.

ఇక ఈ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ గెటప్ లు వేసుకొని జబర్దస్త్ కమెడియన్లు వారి పాటలకు స్టెప్పులు వేశారు. అంతేకాకుండా ఈ షోలో అనుపమ పాట కూడా పడింది. అనుపమ ఇలా అందంగా పాట పాడటంతో నిఖిల్ తో పాటు అక్కడున్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇక ఎప్పటిలాగే ఈ షోలో ఆది రాంప్రసాద్ పంచ్ లతో ఈ షో సందడిగా ఉండబోతోంది. ఇక ఆది కూడా వర్ష తో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసాడు.కానీ రామ్ ప్రసాద్ మధ్యలో వచ్చి నువు ఇక్కడ వర్ష తో బాగా డాన్స్ చేస్తున్నావ్…కానీ నాకు ఫైమాని భార్యగా ఇచ్చారు. చచ్చిపోతున్నాను లోపల అంటూ తన బాధ చెప్పుకొచ్చాడు.