మ‌రో జ‌ర్న‌లిస్ట్‌ను బ‌లితీసుకున్న క‌రోనా..!

క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రో జ‌ర్న‌లిస్ట్‌ను బ‌లితీసుకుంది. ప్ర‌ముఖ తెలుగు న్యూస్‌ చాన‌ల్ రిపోర్ట‌ర్ మ‌ధుసూధ‌న్ రెడ్డి క‌రోనా కార‌ణంగా ప్రాణాలు కోల్పోవ‌డం మీడియా వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపింది. అస‌లు వివ‌రాల్లోకి వెళితే ఆంధ్ర‌ప్ర‌దేవ్ క‌డ‌ప జిల్లాకు చెంద‌ని మ‌ధు సూధ‌న్ రెడ్డి, ఇటీవ‌ల క‌రోనా టెస్ట్ చేయించుకోగా, ఆయ‌న‌కు పాజిటివ్ నిర్ధార‌ణ అయ్యింది. దీంతో తిరుప‌తి ఆస్ప‌త్రిలో చేరిన మ‌ధు సూధ‌న్ రెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇక ఇటీవ‌ల తిరుప‌తిలోనే వీడియో జ‌ర్న‌లిస్ట్‌గా ప‌నిచేస్తున్న పార్ధ‌సారథి క‌రోనా కార‌ణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మ‌రో జ‌ర్న‌లిస్ట్ కూడా మ‌ర‌ణించ‌డంతో, మీడియా వ‌ర్గాలు ఆందోళ‌ణ చెందుతున్నాయి. ‌