Director Parasuram: పరశురామ్ దర్శకత్వంలో రానున్న మరో భారీ మల్టీస్టారర్ చిత్రం.. హీరోలు ఎవరంటే?

Director Parasuram: టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ చిత్రాల హవా ఎప్పటినుంచో కొనసాగుతోంది. మధ్యలో కొన్ని సంవత్సరాల పాటు బ్రేక్ ఇచ్చిన తిరిగి ఈ మల్టీ స్టారర్ చిత్రాలను మహేష్ బాబు వెంకటేష్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ద్వారా ప్రారంభించారని చెప్పవచ్చు. అప్పటినుంచి ఇప్పటివరకు ఎన్నో మల్టీస్టారర్ చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా మరో భారీ మల్టీస్టారర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది. అయితే ఆ సినిమా ఏది హీరోలు ఎవరు అనే విషయానికి వస్తే…

గీతా గోవిందం సినిమా ద్వారా విజయ్ దేవరకొండకు ఎంతో అద్భుతమైన హిట్ అందించిన డైరెక్టర్ పరుశురామ్ ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న సర్కారీ వారి పాట చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ క్రమంలోనే డైరెక్టర్ పరశురామ్ ఒక అద్భుతమైన కథతో భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ మల్టీ స్టారర్ చిత్రంలో మహేష్ బాబు హీరోగా చేయనున్నట్లు తెలుస్తోంది.ఇక మరొక హీరో ఎవరు అనే విషయానికి వస్తే పరశురాం దర్శకత్వంలోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విజయ్ దేవరకొండ నటిస్తున్నట్లు సమాచారం.

పరశురామ్ అడిగితే విజయ్ దేవరకొండ నో చెప్పే అవకాశం ఉండదు. అలాగే మహేష్ బాబు అంటే విజయ్ దేవరకొండకి ఎంతో ఇష్టం కనుక ఏలాంటి పరిస్థితుల్లోనూ ఈ సినిమాకి నో చెప్పే అవకాశం లేదు. ఇకపోతే ఈ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు టాలీవుడ్ సమాచారం. ఇలా ఈ కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ చిత్రం రాబోతోందని తెలియడంతో ఈ ఇద్దరు హీరోల అభిమానులు ఎంతో ఖుషి అవుతున్నారు. అయితే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన తెలియాల్సి ఉంది. ఒకవేళ అధికారిక ప్రకటన చేసినా మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట పూర్తి కాగానే త్రివిక్రమ్ సినిమా అలాగే రాజమౌళి సినిమా అనంతరం పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.