టీడీపీ అధినేత చంద్రబాబు ఇంత అమాయకుడా.. ??

 

ఏపీలో టీడీపీ పరిస్దితి రోజు రోజుకు దివాళ తీసిన బ్యాంకులా మారిపోతుందట.. దీన్ని అడ్దం పెట్టుకుని కొందరు నాయకులు ఆ పార్టీ అధినేతకు జలక్ కూడా ఇస్తున్నారట.. ఇప్పటికే పచ్చ బస్సులోని సీట్లన్ని ఖాళీ అయ్యి వైసీపీ నిండిపోయింది.. అంతే కాకుండా ఇప్పటికే మరి కొందరు టీడీపీ నుండి జారుకునే ఆలోచన చేస్తుండటంతో ఫోను రింగైతే చాలు టీడీపీ అధినేతకు చెమటలు పడుతున్నాయట.. ఏ నాయకుడి నోటి నుండి ఏం మాట వినవలసి వస్తుందో అని.. ఇక వార్తలు చదివితే గోడ దూకడానికి సిద్దమైన నాయకుడు అంటూ పూటకో పేరు మీడియాలో వస్తోంది. దాంతో ఎవరిని నమ్మాలో తెలియక చంద్రబాబు లాంటి రాజకీయ దురంధరుడు తికమకపడుతున్నారట.

ఇదే అదనుగా కొందరు నాయకులైతే బాబుగారితో బేరాలకు దిగుతూ పార్టీ వీడకుండా ఉండాలంటే నాకేంటి లాభం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారట.. ఇకపోతే ఉత్తరాంధ్రాలో టీడీపీ తరఫున అరుగురు ఎమ్మెల్యేలు గెలిచిన విషయం తెలిసిందే.. వీరు కూడా సైకిల్ దిగిపోతారనే అనుమానంతో చంద్రబాబు ప్రతీ రోజూ వారితో ఫోన్లో టచ్ లో ఉన్నా కూడా ఉంటున్నారట.. అయినా కూడా అందులో హ్యాండ్ ఇచ్చేది ఎవరో కనిపెట్టలేక పోతున్నారుట.

అంటే ఒకరకంగా చంద్రబాబును అమాయకుడిని చేసి నేను పార్టీ వీడను అంటూనే వేరే పార్టీలోకి బంగి జంప్ చేస్తున్న నాయకులను చూస్తున్న వారు.. ఈ హైటెక్ బాబు ఇంత అమాయకుడిగా ఎప్పుడు మారాడు అని ముక్కున వేలేసుకుంటున్నారట.. తన పార్టీలో జరుగుతున్న గూడుపుఠానిలే కనిపెట్టలేని బాబు ఇక ప్రజల కష్టాలను ఏమాత్రం గ్రహిస్తాడని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారట.. చంద్రబాబు దీనావస్దను చూసి..

ఇక శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే ఇక్కడ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో ఒకరు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, మరొకరు ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్. ఇతని తండ్రితో పాటుగా ఇతను కూడా టీడీపీనే నమ్ముకుని ఉన్నారు.. కాగా ఈ మధ్యనే అశోక్ తండ్రి ప్రకాష్ మరణించగా ఈయనను పరమర్శించడానికి ఎక్కువగా వచ్చిన వారిలో వైసీపీ నేతలే ఉన్నారట.. దీంతో ఆయన టీడీపీని వీడిపోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. ఇక టీడీపీలో జరుగుతున్న పరిణామాలను గ్రహిస్తున్న వారు అచ్చెన్న ఒక్కరే టీడీపీకి మిగిలేలా ఉన్నారనే సందేహం వెల్లడిస్తున్నారట..

అశోక్ అయితే తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించలేదు. కానీ సడెన్ గా మీడియా ముందుకు వచ్చి ఊపిరి ఉన్నంత వరకూ సైకిల్ పార్టీని వీడేది లేదు అంటూ పెద్ద ఒట్టే వేశారు. మొత్తానికి అశోక్ తాను గోడ దూకను అంటూ ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేసి అధినేత బాబుకు ఆనందం కలిగించారట.. మరి ఇలా ఎంతకాలం బాబు టీడీపీ నాయకులను నమ్ముకుని అమాయకంగా ఉంటాడో ఆయనకే తెలియాలి అని అనుకునే వారు కూడా లేకపోలేదు..