కరోనా అప్డేట్: ఏపీలో కొత్తగా 1,535 పాజిటివ్‌ కేసులు…18,210 యాక్టివ్‌ కేసులు

Andhra pradesh state corona health bulletin

ఆంధ్ర ప్రదేశ్: రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 69,088 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 1,535 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 19,89,296 కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 2,075 మంది కోలుకోగా వారితో కలిపి ఇప్పటి వరకు మొత్తం 19,57,455 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఏపీలో 18,210 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో 2,55,95,949 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Andhra pradesh state corona health bulletin
 

కరోనా కారణంగా చిత్తూరు-3, కృష్ణ-3, నెల్లూరు-3, తూర్పుగోదావరి-2, పశ్చిమ గోదావరి-2, గుంటూరు-1, కడప-1, విశాఖ పట్నంలో ఒక్కరు చొప్పున ​మొత్తం 16 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 13,631 కి చేరింది. ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే… అనంతపూర్-31, చిత్తూరు-237, తూర్పుగోదావరి-299, గుంటూరు-173, కడప-39, కృష్ణ-109, కర్నూలు-08, నెల్లూరు-211, ప్రకాశం-107, శ్రీకాకుళం-54, విశాఖపట్నం-65, విజయనగరం-25, పశ్చిమ గోదావరిలలో-177 చొప్పున కేసులు నమోదయ్యాయి.

గమనిక: కరోనాను కట్టడికి ప్రస్తుతం వాక్సిన్ ఒక్కటే పరిష్కార మార్గం. భౌతిక దూరం పాటించండి, మాస్క్ ధరించండి, చేతులను శుభ్రంగా శానిటైజ్ చేసుకోండి.