ఇవాళ సీఎం జగన్ షెడ్యూల్ బిజీ బిజీ.. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్!

ఇవాళ సీఎం జగన్ మోహన్ రెడ్డి బిజీ బిజీ షెడ్యూల్ గడుపనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. అనంతరం మూడు గంటలకు పార్టీ నేతలు, మంత్రులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు సిఎం జగన్ మోహన్ రెడ్డి.

సాయంత్రం ఐదు గంటలకు విజయవాడ వన్ టౌన్‌లో షా జహూర్ ముసాఫిర్ ఖానా ప్రారంభోత్సవం ఉండనుంది. అనంతరం ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించనున్నారు. ఆరు గంటల ప్రాంతంలో ఇందిరాగాంధీ స్టేడియంలో ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి జగన్. గంటన్నర పాటు ఇఫ్తార్ కార్యక్రమంలో ఉండనున్న సీఎం.. రాత్రి ఏడున్నరకు మంగళగిరి చేరుకోనున్నారు. గుంటూరు జడ్పీ ఛైర్‌పర్సన్ క్రిస్టినా కుమారుడి వివాహ వేడుకకు హాజరు కానున్నారు.