Anchor Anasuya: ద్విపాత్రాభినయంలో ప్రేక్షకులను సందడి చేయనున్న అనసూయ.. ప్రయోగం ఫలించేనా?

Anchor Anasuya:జబర్దస్త్ యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ రంగస్థలం సినిమా ద్వారా వెండితెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది.ఇలా వెండి తెరపై ఎన్నో సినిమాలలో నటించడమే కాకుండా పలు సినిమాలలో ఐటెం సాంగులకు డాన్స్ చేస్తూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న అనసూయ తాజాగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ద్వారా దాక్షాయిని పాత్రలో ప్రేక్షకులను సందడి చేశారు. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా ఈ యాంకరమ్మ రవితేజ నటిస్తున్న సినిమాలో సందడి చేయనుంది.

రవితేజ హీరోగా నటిస్తున్న ఖిలాడి సినిమాలో అనసూయ ప్రయోగాత్మక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఈమె ద్విపాత్రాభినయంలో నటిస్తుందని ఒక పాత్రలో రెబల్ గా సందడి చేయగా మరొక పాత్రలో ఒక బ్రాహ్మణ యువతి పాత్రలో అనసూయ కనిపిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఒక పాత్రలో అనసూయ చనిపోతుందని చివరి వరకు రెండు పాత్రలలో అనసూయ ఎలా నటించింది అనేది అందరికీ ఆసక్తి కలిగిస్తుంది.

ఇలా మొట్టమొదటిసారిగా ద్విపాత్రాభినయంలో ప్రయోగాత్మక పాత్ర ద్వారా అనసూయ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ ప్రయోగాత్మక పాత్రలో ఈమె ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.ఇకపోతే ఈ సినిమాని ఫిబ్రవరి 11వ తేదీన విడుదల చేయడానికి చిత్ర బృందం పెద్ద ఎత్తున సన్నాహాలు ఏర్పాట్లు చేస్తున్నారు.క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత రవితేజ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి మాస్ మహారాజా ఈ అంచనాలను చేరుకుంటారు లేదా అనేది తెలియాల్సి ఉంది.