నోటి దురుసుతో కెరీర్ ని పాడుచేసుకుంటున్న అనసూయ

సాక్షి టీవీ లో యాంకర్ గా కెరీర్ ఆరంభించిన అనసూయ తర్వాత రియాలిటీ షోస్ తో బాగా పాపులర్ అయ్యింది. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ‘రంగస్థలం’, ‘పుష్ప’, ‘క్షణం’ లాంటి సినిమాలు అనసూయకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

అయితే అనసూయ కి కొంచెం నోటి దురుసు ఎక్కువ. కొన్నేళ్ళక్రితం తాను హోస్ట్ చేస్తున్న ‘జబర్దస్త్’ ప్రోగ్రాం వుల్గర్ గా ఉందని, అలాగే తన డ్రెస్సింగ్ కూడా ఎబ్బెట్టుగా ఉందని, కుటుంబంతో చూడడానికి ఇబ్బందిగా ఉందని కొందరు అంటే….వాళ్ల మీద విరుచుకుబడింది అనసూయ.

తాజాగా అనసూయ ని ‘ఆంటీ’ ని కొందరు ట్రోల్ చెయ్యడం మొదలుపెట్టారు. నిజానికి ‘ఆంటీ’ అంటే అదేమీ బూతు కాదు. పైగా దాదాపు నలభై ఏళ్ళ వయసుకు దగ్గర్లో ఉన్న అనసూయ ని ‘ఆంటీ’ అంటే తప్పు కాదు. దీన్ని సీరియస్ గా తీసుకున్న అనసూయ ‘ఏజ్ షేమింగ్’ చేసినందుకు మీ మీద కేసు పెడతా అని వార్నింగ్ ఇచ్చింది.

అయితే ఈ నోటి దురుసు అనసూయకు పెద్ద తలనొప్పిగా మారింది. తాజా సమాచారం ప్రకారం ‘పుష్ప 2 ‘ సినిమాలో నుండి అనసూయని తీసేసి వేరే స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని తీసుకోవాలని సుకుమార్ చూస్తున్నట్టు తెలుస్తుంది.