Anchor Anasuya: అనసూయను ఆంటీ అన్న నెటిజన్.. పెంపకంపై అనుమానం ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన అనసూయ!

Anchor Anasuya: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్ర ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్నారు.ఈ సినిమాలో ఈమె క్యారెక్టర్ కు ఎంతో మంచి గుర్తింపు రావడంతో వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే అనసూయ ప్రస్తుతం పుష్ప చిత్రం ద్వారా పాన్ ఇండియా సినిమాల్లో నటించారు. ఈ సినిమాలో దాక్షాయిని పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇకపోతే అనసూయ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఎన్నో ఫోటోలను షేర్ చేయడంతో దారుణంగా నెటిజన్ల ఆగ్రహానికి గురవుతుంటారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా అనసూయపై ఎంతోమంది నెగిటివ్ కామెంట్లు చేసినప్పటికీ అనసూయ వారికి ధీటుగా సమాధానం చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా మరో నెటిజన్ అనసూయను తనదైన శైలిలో ప్రశ్నించారు తాజాగా ఈ యాంకరమ్మ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ అనసూయను రెచ్చగొట్టే విధంగా ప్రశ్నల వర్షం కురిపించారు. ఇలా ఒక నెటిజన్ అనసూయను ప్రశ్నిస్తూ మిమ్మల్ని ఆంటీ అని పిలవాలా? లేక అక్క అని పిలవాలా? అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు అనసూయ స్పందిస్తూ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. నువ్వు నన్ను అలా పిలవడానికి మన మధ్య ఏ విధమైనటువంటి సాన్నిహిత్యం లేదు. పైగా నువ్వు అడిగిన ప్రశ్న ఏజ్ షేమింగ్ కిందికి వస్తుంది ..ఇలాంటి ప్రశ్న అడిగినప్పుడే నీ పెంపకంపై అనుమానం కలుగుతోంది అంటూ అనసూయ సమాధానం చెప్పారు.ఈ విధంగా అనసూయ చెప్పిన ఈ సమాధానం పై మరికొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇందులో తప్పేముంది అని ప్రశ్నించారు.