ఆది, సుధీర్ బాటలో అనసూయ కూడా జబర్ధస్త్ కి గుడ్ బై చెప్పనుందా?

అందాల భామ అనసూయా గురించి తెలియని వారుండరు. ఈటీవిలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో లో యాంకర్ గా సందడి చేస్తు బుల్లి తెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా జబర్ధస్త్ కి యాంకరింగ్ చేస్తున్న అనసూయ నటిగా కన్నా యాంకర్ గా బాగా గుర్తింపు పొందింది. ఒకప్పుడు బుల్లితెరలో ప్రసారం అవుతున్న అన్ని టీవీ షోలలో టాప్ రేటింగ్ కొనసాగుతున్న జబర్దస్త్ కార్యక్రమమం ప్రస్తుతం రేటింగ్స్ పడిపోయి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ జబర్దస్త్ కామెడీ షో ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చింది. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లు గా పాపులర్ అయ్యారు.

మొదట నాగబాబు జబర్దస్త్ వీడిన సమయంలో ఆయనతో పాటు కొందరు కమెడియన్లు జబర్దస్త్ ని విడిచి వెళ్లారు. ఇటీవల మంత్రి పదవి దక్కడంతో రోజా కూడా జబర్దస్త్ ను వదిలి వెళ్ళిపోయింది. ఆ తర్వాత జబర్దస్త్ కి మూలస్తంభాలుగా ఉన్న హైపర్ ఆది, సుడిగాలి సుదీర్, గెటప్ శ్రీను, అదిరే అభి వంటి వారు వరసగా జబర్దస్త్ నుండి వెళ్లిపోయారు. సుధీర్, హైపర్ ఆది లేకపోవటంతో షో నడిపించటం చాలా కష్టంగా మారింది. అంతే కాకుండా ప్రస్తుతం జబర్ధస్త్ పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యింది.

తాజాగా జబర్ధస్త్ కి సంబంధించిన మరొక వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నో సంవత్సరాలుగా జబర్దస్త్ షో లో యాంకరింగ్ చేస్తున్న అనసూయ ప్రస్తుతం సుధీర్, హైపర్ ఆది దారిలోనే వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అనసూయా ఒకవైపు యాంకరింగ్, మరొకవైపు సినిమాలతో బిజీగా ఉంటోంది. ప్రస్తుతం ఆమె మా టీవీలో ప్రసారమవుతున్న సూపర్ సింగర్ జూనియర్స్ షో కి కూడా సుధీర్ తో కలిసి యాంకరింగ్ చేస్తోంది. అందువల్ల అనసూయ కూడా అందరిలాగే జబర్ధస్త్ కి స్వస్తి చెప్పనుంది. అంతే కాకుండా జబర్ధస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ రెండు షో లు కలిపి ఒక్క షోగా కుదించబోతున్నారు. ఆ షో కి యాంకర్ గా రష్మి వ్యవహరించనుంది. అందువల్ల అనసూయా కూడా జబర్ధస్త్ కి గుడ్ బై చెప్పనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.