రెండుసార్లు జబర్దస్త్ యాంకర్ గా అవకాశం వచ్చిన రిజెక్ట్ చేసిన యాంకర్.. కారణం అదేనా?

బుల్లితెరపై విపరీతమైన ఆదరణ సంపాదించుకొని అత్యధిక రేటింగ్ తో దూసుకుపోతున్న కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి.గత పది సంవత్సరాల నుంచి ఎంతోమంది కమెడియన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసి,అద్భుతమైన కామెడీ షో గా దూసుకుపోతున్న ఈ కార్యక్రమానికి విపరీతమైన ఆదరణ వస్తుంది. ఇకపోతే గత కొంతకాలం నుంచి ఈ కార్యక్రమం ద్వారా గుర్తింపు సంపాదించుకున్న వారందరూ ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళిపోతున్నారు. ఈ క్రమంలోనే యాంకర్ అనసూయ కూడా బయటికి వెళ్లడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఇకపోతే అనసూయ పలు సినిమాలు వెబ్ సిరీస్ ల కారణంగా ఈ కార్యక్రమం నుంచి తప్పుకుందని వార్తలు వస్తున్నాయి.ఇక అనసూయ ఈ కార్యక్రమం నుంచి వెళ్లడంతో ఈ కార్యక్రమానికి యాంకర్ గా మల్లెమాలవారు శ్రీముఖిని సంప్రదించారని తెలుస్తుంది. అయితే శ్రీముఖికి ఇది మొదటిసారి కాదు జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా రెండుసార్లు అవకాశం వచ్చిన తాను ఈ అవకాశాన్ని వదులుకుంది. అయితే ఎంతో పాపులర్ అయిన ఈ కామెడీ షోకు యాంకరింగ్ చేసే అవకాశం వచ్చిన శ్రీముఖి ఎందుకు రిజెక్ట్ చేశారు అనే విషయానికి వస్తే..

ఈ కార్యక్రమం ప్రారంభమైన మొదట్లో ముందుగా ఆ అవకాశం శ్రీముఖిని వెతుక్కుంటూ వెళ్ళింది. అయితే ఈ కార్యక్రమం పెద్దగా సక్సెస్ కాకపోవచ్చన్న ఉద్దేశంలో శ్రీముఖి ఈ కార్యక్రమాన్ని రిజెక్ట్ చేసింది.అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమం ఎంతో విజయాన్ని అందుకున్నప్పటికీ అనసూయ వెళ్ళిన తర్వాత ఆ అవకాశం తిరిగి ఈమెకే వచ్చింది. అయితే ప్రస్తుతం శ్రీముఖి వరస బుల్లితెర కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉండడమే కాకుండా ఈమెకు డిమాండ్ కూడా భారీగా పెరిగింది.దీంతో శ్రీముఖి డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ మల్లెమాలవారు ఇవ్వకపోవడంతో రెండోసారి కూడా ఆ అవకాశాన్ని మిస్ చేసుకున్నట్లు తెలుస్తోంది.