Amitabh Bacchan: కంటికి రెప్పలా చూసుకుంటున్న ఇంటిని అమ్మేసిన అమితాబచ్చన్.. కారణం ఏంటి?

Amitabh Bacchan: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అత్యంత ధనవంతులలో ఒకరు. ఆయనకు ముంబైలోని జుహులో ఐదు విలాసవంతమైన బంగళాలు ఉన్నాయి.జనక్, జల్సా, ప్రతీక్ష, వత్స, అమ్మ అని వాటికి పేర్లు కూడా పెట్టుకున్నారు. ఐతే చాలా కాలం క్రితం అమితాబచ్చన్ సౌత్ ఢిల్లీలో తన కుటుంబంతో కలిసి ఉండటానికి ఒక లగ్జరీ ఇంటిని నిర్మించుకున్నాడు. ఆ ఇంటికి “సోపాన్ ” అని పేరు కూడా పెట్టుకున్నాడు. అమితాబచ్చన్ సినిమాలలోకి రాకముందు సౌత్ ఢిల్లీలో ఉన్న ఇంటిలో తన తల్లిదండ్రులతో కలిసి ఎంతో కాలం జీవించారు.

అయితే ఇటీవల అమితాబచ్చన్ ఎంతో అపురూపంగా చూసుకున్న ఆ ఇంటిని అమ్మేశాడు. అమితాబచ్చన్ ఎంత సంపాదించిన తన తల్లిదండ్రులతో కలిసి జీవించిన ఆ ఇంటిని ఎంతో అపురూపంగా చూసుకున్నాడు. అయితే ప్రస్తుతం ఆ ఇంటిని నెజోన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈఓ అవని బడెర్ కొనుగోలు చేశారు. అవని బడెర్ బచ్చన్ కుటుంబానికి ఎంతో సన్నిహితులు. సోపాన్ కి దగ్గరలోనే అవని బడెర్ కుటుంబం కూడా నివసించేది .సోపన్ ని బాగా చూసుకుంటారు అనే నమ్మకంతో అమితాబ్ ఆ ఇంటిని వారికి అమ్మినట్టు సమాచారం .అయితే సోపాన్ పాత కట్టడం కావడంతో అవని బడేర్ ప్రస్తుతం కొత్త హంగులతో మరొక విలాసవంతమైన బంగ్లా నిర్మించనున్నారు.

అయితే ప్రస్తుతం సోపాన్ నీ కొనటానికి అవని వెచ్చించిన డబ్బు ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అవని ఆ ఇంటికోసం రూ 23 కోట్ల ఖర్చు చేశారని సమాచారం. ఐతే సడన్ గా బిగ్ బి ఎంతో అపురూపంగా చూసుకున్న ఆ ఇంటిని ఎందుకు అమ్మాడో అని చాలా మందిలో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అమితాబ్ ముంబైలోని జూహులో జల్సా పేరుతో కట్టుకున్న ఇంట్లో తన కుటుంబంతో కలిసి ఉంటున్నారు.