NTR – Allu Arjun: ఒకే వేదికపై సందడి చేయనున్న అల్లు అర్జున్… ఎన్టీఆర్… అభిమానులకు పూనకాలే!

NTR – Allu Arjun:టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఒకరు.ప్రత్యేకంగా ఈ ఇద్దరి హీరోలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే విషయం మనందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో యంగ్ హీరోలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఒకే వేదికపై సందడి చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ ఎన్నో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ప్రీ రిలీజ్ వేడుకలకు హాజరైన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 35వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీ లాంఛనంగా పూజా కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ రానున్నట్లు సమాచారం.

ఇలా ఒకే చోట తారక్ బన్నీ సందడి చేయడంతో వీరి అభిమానులకు పండగే అని చెప్పవచ్చు. నిజానికి కొరటాల శివ ఆచార్య సినిమా తర్వాత తన తరువాత ప్రాజెక్ట్ అల్లు అర్జున్ తో చేయాల్సి ఉంది. కానీ అల్లు అర్జున్ పుష్ప 2 తోబిజీగా ఉండటం వల్ల వీరి ప్రాజెక్టు మరింత ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఈయన సినిమాని పట్టా లెక్కిస్తున్నారు.ఇదివరకే తారక్ కొరటాల కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసింది ఈ క్రమంలోనే మరోసారి ఇదే కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటే అభిమానులు పెద్ద ఎత్తున ఈ సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు.