అదే కాపీ పోస్ట్ తో అల్లు అర్జున్ కూడా విరాళం..ఏం జరుగుతుందో?

సడెన్ గా ఏమయ్యిందో కానీ ఏపీలో జరిగినటువంటి డిజాస్టరస్ ఘటన వరదల నిమిత్తం ఇప్పుడు టాలీవుడ్ పరిశ్రమ ఒక్కసారిగా స్పందించింది. కొంతమంది మినహా ఆల్ మోస్ట్ మన టాలీవుడ్ అగ్ర హీరోలు అంతా ఏదో కావాలని చేస్తున్నట్టుగా ఒకటే లాంటి పోస్ట్ తో ప్రతి ఒకరు ఒక రూపాయి తక్కువ కాకుండా 25 లక్షలు మాత్రమే విరాళం అందిస్తున్నారు.

మరి నిన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి స్టార్ట్ అయ్యిన ఈ విరాళ పర్వం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరకు కూడా వచ్చింది. కొంచెం మేటర్ అటు ఇటు అయ్యినా మన టాలీవుడ్ స్టార్స్ అందరూ చెప్తున్నా మేటర్ నే కాపీ పేస్ట్ చేసి చెప్పినట్టు పోస్ట్ చేశారు. అయితే ఇదంతా కూడా ఒక ప్రాసెస్ లో జారుతున్న డౌట్ అయితే అందరిలోనూ కలుగుతుంది.

సడెన్ గా ఒకరి తర్వాత ఒకరు స్పందించడం, అదే 25 లక్షలు ఇవ్వడం ఏదన్నా ఒత్తిడి వల్ల జరిగిందా లేక తమ సినిమాలు కోసం ఇలా చేస్తున్నారా అని అనేక అనుమానాలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. ఇక ముందు ఇంకా ఎవరెవరు ఇస్తారో చూడాలి.