బన్నీ కోసం భారీ అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసిన అరవింద్

Allu Aravind and Prashanth Neel

Allu Aravind and Prashanth Neel

బన్నీ పాన్ ఇండియా స్టార్ అయ్యే పనిలో బిజీగా ఉన్నారు. ఇకపై చేయబోయే ప్రతి సినిమా తన స్థాయిని జాతీయ స్థాయికి పెంచేదిగా ఉండాలని భావిస్తున్నారు. అందుకే ‘అలవైకుంఠపురములో’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత తొందరపడి సినిమాలకు సైన్ చేసేయ్యకుండా ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఎంతో ఆలోచించి సుకుమార్ ‘పుష్ప’కు ఒకే చెప్పారు. భారీ వ్యయంతో ఈ సినిమా నిర్మితమవుతోంది. దీనితర్వాత ప్రాజెక్ట్ ఏంటో, ఎవరితోనో ఇంకా తెలియలేదు. అయితే ఈమధ్యనే అల్లు అరవింద్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చర్చలు జరిపారు. బన్నీతో ఒక సినిమాను చేసి పెట్టమని ప్రపోజల్ పెట్టారు ఆయన ముందు.

కథా చర్చలు కూడ ముమ్మరంగా జరిగాయి. ఈ చర్చలన్నీ సఫలమైనట్టే అనిపిస్తోంది. గీతా కాంపౌండ్ నుండి వినిపిస్తున్న వార్తల మేరకు అన్నీ సెట్టయ్యాయని, ప్రశాంత్ నీల్ బన్నీ సినిమాకు ఓకే చెప్పారని తెలుస్తోంది. అంతేకాదు ప్రశాంత్ నీల్ కు అల్లు అరవింద్ అడ్వాన్స్ రూపంలో పెద్ద మొత్తాన్నే ఇచ్చినట్టు చెబుతున్నారు.

దీన్నిబట్టి ‘సలార్’ తర్వాత ప్రశాంత్ నీల్ బన్నీతోనే సినిమా చేసేలా ఉన్నారు. ఇప్పటికే పూర్తైన ‘కెజిఎఫ్ 2’ విడుదలకు రెడీ అవుతోంది. ‘సలార్’ ఎలాగూ దాన్ని మించేలా ఉంటుందట. అంటే బన్నీ సినిమా ఈ రెండు సినిమాలకంటే ఒక మెట్టు పైనే ఉంటుందేమో.