అల్లు అరవింద్ సినిమాపై రాజకీయమా.. అంత దమ్ముందా ?

Allu Aravind becomes angry over wrong propaganda

Allu Aravind becomes angry over wrong propaganda

అల్లు అరవింద్ అంటే ఇండస్ట్రీలో బడా నిర్మాత. ఆయనకు ఎదురెళ్లి ఆయన సినిమాల్ని బద్నాం చేసే సాహసం ఎవరూ చేయరు. ఇది అందరికీ తెలిసిన సంగతి. కానీ చేశారట. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ 2 పేరుతో బ్యానర్ పెట్టి చిన్న సినిమాల్ని నిర్మిస్తుంటారు. ఆ సినిమాలు బాగానే ఆడుతున్నాయి కూడ. ఈ బ్యానర్ మీద నిర్మితమయ్యే సినిమాలకు బన్నీ వాస్ నిర్మాత. తాజాగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ మీద రూపుదిద్దుకున్న సినిమా ‘చావు కబురు చల్లగా’. కార్తికేయ హీరోగా నటించిన ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి కథానాయకి. కౌశిక్ దర్శకుడు. మార్చి 19న సినిమా రిలీజ్ కానుంది.

అయితే కొన్ని రోజులుగా సినిమా థియేటర్లలో వచ్చిన రెండు వారాల్లోనే ఓటీటీకి వెళ్తుందని వార్తలు జోరుగా వచ్చాయి. గతంలో చేసుకున్న ఒప్పందాల మేరకు నాలుగు వారాల తర్వాతే సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయాలి. కానీ కార్తికేయ సినిమా రెండు వారాల్లో వచ్చేస్తుందని అన్నారు. దీనిపై చిత్ర నిర్మాత బన్నీ వాస్ తీవ్రంగా స్పందించారు. రెండు రోజులుగా ఓ విషయం చాలా బాధ కలిగిస్తోంది. మా సినిమా రెండు వారాల్లో ఓటీటీకి వెళ్తుందని కొందరు నిర్మాతలు వారి పీఆర్‌ఓల ద్వారా మీడియాకు తప్పుడు సమాచారం అందించారు. వారు పరిశ్రమకు కొత్తో, పాతో, ఎన్ని సినిమాలు చేశారో నాకు తెలీదు. వారి పేర్లు చెప్పి పరిశ్రమలో గొడవలు నాకు ఇష్టం లేదు. మా సినిమాలను థియేటర్లో విడుదల చేయడానికే ఇష్టపడతాం అన్నారు. బన్నీ వాస్ సీరియస్ అయిన తీరు చూస్తే వెనుక అల్లు అరవింద్ ఏ స్థాయిలో మండిపడి ఉంటారో అర్థం చేసుకోవచ్చు.