Akshay Kumar: అక్షయ్ కుమార్ కొత్త ఇంటి కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో తెలుసా?

Akshay Kumar: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గురించి మనందరికీ తెలిసిందే. బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు. అక్షయ్ కుమార్ నటించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అక్షయ్ కుమార్ కు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉంటే తాజాగా అక్షయ్ కుమార్ ముంబైలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశాడు. ముంబై లోని ఖార్ వెస్ట్ లోని జాయ్ లెజెంట్ భవనంలో 19వ ప్లోర్ లో ఉన్న అపార్ట్ మెంట్ ను అక్షయ్ కుమార్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ అపార్ట్ మెంట్ 1878 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అపార్ట్ మెంట్ కోసం అక్షయ్ కుమార్ దాదాపుగా 7 కోట్ల 80 లక్షల వరకూ ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఇప్పటికీ పలు సార్లు ఖరీదైన ఫ్లాట్లు కొనుగోలు చేసిన అక్షయ్ కుమార్ తాజాగా ముంబైలో మరొక ప్లాట్ ని కొనుగోలు చేశాడు. ఇకపోతే ప్రస్తుతం అక్షయ్ కుమార్ తన కుటుంబంతో కలిసి ముంబై లోని అత్యంత ఖరీదైన ప్రాంతం జూహు లో ఒక డూప్లెక్స్ బిల్డింగ్ లో నివసిస్తున్నారు.

ఇకపోతే గతంలో అంధేరి ప్రాంతంలో ఒక ఖరీదైన కమర్షియల్ స్పేస్ ని కొనుగోలు చేసిన అక్షయ్ కుమార్ ఈమధ్య దానిని 9 కోట్లకు అమ్మేశాడు అక్షయ్ కుమార్. కేవలం ఇవి మాత్రమే కాకుండా అక్షయ్ కుమార్ కు ముంబై, గోవా ఇలాంటి ప్రాంతాలలో ఖరీదైన ఫ్లాట్లు ఉన్నాయి. ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోల మొదటి హీరోగా ఒక వెలుగు వెలుగుతూ దూసుకుపోతున్నాడు. అంతేకాకుండా బాలీవుడ్ లో వంద కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరో అక్షయ్ కుమార్. అయితే ఇప్పటివరకు ఒక్క సినిమాకు వంద కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్న అక్షయ్ కుమార్ సిండ్రెల్లా సినిమాకీ మాత్రం ఏకంగా 135 కోట్లు తీసుకుంటున్నాడని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.