Akhanda Movie: ఆఖండ సినిమా సీక్వెల్ ను ఆ హీరోలతో తీస్తాను అంటున్న నిర్మాత..?

Akhanda Movie: బోయపాటి శ్రీను,బాలకృష్ణ కాంబినేషన్ లో ఇటీవల తెరకెక్కిన చిత్రం అఖండ. ఈ సినిమా విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఇందులో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా వంద కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టింది. అంతేకాకుండా ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. నేడు అనగా డిసెంబర్ 29న మిర్యాల రవీందర్ రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా బాలయ్య గురించి, అఖండ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ..

అఖండ సినిమా ఇంత పెద్ద విజయాన్ని సాధిస్తుంది అని ముందుగానే ఊహించానని తెలిపారు. ఈ విషయాన్ని బాలకృష్ణ, బోయపాటి దాస్తూ వస్తున్నప్పటికీ నేను మాత్రం మాట్లాడుతున్నాను అని తెలిపారు. ఇక మొదటి నుంచి అనుకున్న విధంగానే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది అని తెలిపారు. ఈ సినిమాలో అఘోర పాత్రలో బాలకృష్ణ గారు అద్భుతంగా నటించారు. షూటింగ్ అయిపోయిన తర్వాత బాలకృష్ణ గారితో మాట్లాడాను. ఆయన చాలా సహకరించారు థాంక్స్ అని చెప్పడంతో లేదు లేదు మీరే ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు అని బాలకృష్ణ తెలిపారట.

ఇక ఈ సినిమాకు సీక్వెల్ తీయాలనే కోరిక నాకు కూడా ఉంది. ఒకవేళ ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలనుకుంటే ఈ సినిమాకు అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ వంటి హీరోలు అయితే బాగుంటుంది అని తెలిపారు మిరియాల రవీందర్ రెడ్డి. అయితే నేను కేవలం స్టార్ హీరోలతోనే కాకుండా అందరు హీరోలతో సినిమాలు చేస్తాను. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది మార్చిలో ఒక సినిమాను ప్రారంభిస్తాను. అందులో ఒక కొత్త హీరోని పరిచయం చేయబోతున్నాను అని తెలిపారు. ఈ సినిమాతో పాటుగా మరొక పెద్ద సినిమా కూడా చర్చ దశలో ఉంది. ఆ సినిమా ఇంకా ఫైనల్ కాలేదు. హీరోలకు ముందుగానే అడ్వాన్సు ఇచ్చి బుక్ చేసుకోవడం నాకు తెలియదు. ఎవరైనా కథ చెబితే నచ్చితే దానికి తగ్గట్టుగా హీరోలకు వినిపించడమే అలవాటు అని చెప్పుకొచ్చారు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి.