Aishwarya -Dhanush: కరోనా బారిన పడ్డ ఐశ్వర్య రజనీకాంత్.. మాస్కులు ధరించండి అంటూ పోస్ట్!

Aishwarya -Dhanush: కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురుగా, ధనుష్ భార్యగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఐశ్వర్య ఈ ఏడాది మొదట్లోనే తన భర్తతో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు.ఇలా ఎంతో అందంగా ఉన్న ఈ జంట విడాకులు తీసుకోవడంతో ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. చాలా మంది అభిమానులు ఈ జంట తిరిగి కలవాలని కోరుకుంటున్నారు.ఇదిలా ఉండగా వీరిద్దరిని కలవడం కోసం అటు ధనుష్ తండ్రి ఇటు రజినీకాంత్ కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా తాజాగా ఐశ్వర్య కరోనా బారిన పడటంతో ఆసుపత్రి పాలైనట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియ చేస్తూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా బారిన పడ్డాను. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి జాగ్రత్తగా ఉండండి. 2022 వన్సంవత్సరం నా కోసం ఇంకా ఏం చేస్తావో అంటూ ఐశ్వర్య పరోక్షంగా విడాకుల గురించి ప్రస్తావిస్తూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈమె చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

ఐశ్వర్య కరోనా బారిన పడ్డారనే విషయం తెలియగానే చాలా మంది ఈమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.కాగా గత కొద్ది రోజుల క్రితం ధనుష్ కూడా కరోనా బారిన పడి కోలుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఐశ్వర్య కూడా కరోనా బారిన పడటంతో చాలామంది ఈమె కోలుకోవాలని తిరిగి వీళ్లిద్దరు కలవాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.