Air India Flight Crash: తాజాగా గుజరాత్ లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనతో భారత్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ ఘటనలో చాలా మంది మరణించిన విషయం తెలిసిందే. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ డ్రీమ్లైన్ 787 వెంటనే జనావాసాలపై కుప్ప కూలిపోయింది. అహ్మదాబాద్ లోని మేఘనినగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
అయితే ఎయిర్ ఇండియా విమానం BJ మెడికల్ కాలేజ్ భవనంపై కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో కాలేజ్ భవనంతో పాటు మరో ఇతర భవనంలో కూడా మంటలు చెలరేగాయి ఈ ఘటనలో దాదాపుగా 20 మందికి పైగా మెడికోలు చనిపోయినట్టు సమాచారం. దీనికి సంబంధించి కచ్చితమైన సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే విమానంలో ఉన్న మృతుల సంఖ్య 130 కి చేరింది. అయితే విమానం గాలిలోకి వెళ్లిన కొద్దిసేపటికే హాస్పిటల్ హాస్టల్ బిల్డింగ్పై విమానం కూలిందని.. రెండు భారీ భవనాల్లో మంటలు చెలరేగాయని అధికారులు వెల్లడించారు.
విమానం కూలడంతో భవనాలు నేలమట్టమయ్యాయి. ఎయిర్ ఎండియా విమానంలో 242 మంది ఉన్నారు. 230 ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నారు. అహ్మదాబాద్ నుంచి 1.38PMకి లండన్ కు బయలుదేరిన AI171 విమానం వెంటనే కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. బోయింగ్ 787-8 విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, 1 కెనడియన్, 7 పోర్చుగీస్ పౌరులు ఉన్నారని అధికారులు తెలిపారు.