చిరంజీవికి మళ్ళీ మళ్ళీ అదే సమస్య.. ఎందుకిలా.?

 

 

మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు ఇటీవల భేటీ అయ్యారు. ఈ భేటీ చిరంజీవి ఇంట్లో జరిగింది గనుక, సమావేశాన్ని ఆయనే నిర్వహించారని అనుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో త్వరలో తెలుగు సినీ ప్రముఖులు పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం విషయమై చర్చించనున్నారు. ఆ సమావేశానికి ఎవరు వెళ్ళాలి.? ఏయే అంశాలు చర్చించాలి.? అన్నదానిపైనే చిరంజీవి ఇంట్లో సమావేశమయ్యారు సినీ ప్రముఖులు. అయితే, ఈ సమావేశానికి బాలకృష్ణ హాజరు కాలేదు. ఎందుకు.? అన్న ప్రశ్న తెరపైకొస్తోంది. ప్రముఖ దర్శకులెవరూ ఈ సమావేశంలో పాల్గొనలేదన్నది ఇంకో వాదన. కావాలనే చిరంజీవి కొందర్ని దూరం పెడుతున్నాiరన్నది ఓ వాదన. అయితే, చిరంజీవిని పరిశ్రమ పెద్దగా సినీ ప్రముఖులు గుర్తించారు. ఆయన నేతృత్వంలోనే కీలక సమావేశాల్ని.. అదీ ఆయన ఇంట్లోనే నిర్వహిస్తున్నారు.

సమస్యల పరిష్కారం కోసం పరిశ్రమ ప్రముఖులు తన వద్దకు వస్తే, చిరంజీవి ‘కాదు, కుదరదు’ అని అనలేరు కదా.? ఇక, బాలకృష్ణ విషయానికొస్తే.. ఆయన టీడీపీ నుంచి శాసనసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అది కూడా, ఆంధ్రప్రదేశ్ నుంచి. సో, ఏపీ ముఖ్యమంత్రితో భేటీ విషయమై పరిశ్రమ నుంచి బాలకృష్ణ స్వయంగా లీడ్ తీసుకుని వుండాల్సింది. అయితే, ఆయనకు ఈ విషయమై ఏం ఇబ్బందులున్నాయన్నది ఎవరికీ తెలియదు. బాలకృష్ణ గనుక సమావేశం నిర్వహిస్తే, దానికి చాలామంది సినీ ప్రముఖులు హాజరవుతారు.. ఇందులో డౌటానుమానాలేవీ లేవు. కానీ, ఆయన అందుకు సుముఖంగా వున్నట్లు కనిపించడంలేదు. చిరంజీవి.. తనంతట తానుగా లీడ్ తీసుకోవడంలేదు. లీడ్ తీసుకోమని ఆయన్ని కోరుతున్నారంతే. కానీ, ఆ విషయమే చాలామందికి అర్థం కావడంలేదు.