Adi Purush: సంక్రాతికి విడుదల కానున్న ఆదిపురుష్..?

Adi Purush: టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో గా నటిస్తున్న తాజా చిత్రం ఆది పురుష్. ఇందులో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా బాలీవుడ్ హీరో
సైఫ్ అలీ ఖాన్ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి అభిమానులకు ఒక శుభవార్త అందింది. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కొత్త విడుదల తేదీని ఖరారు చేసారు.

అదే విషయాన్ని చిత్రబృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. 2023 జనవరి 12న ఆదిపురుష్ సినిమా త్రీడీలో విడుదల కానుందని ప్రభాస్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 11వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా మహమ్మారి వల్ల షూటింగ్ పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది.దీంతో తాజాగా మరొక కొత్త విడుదల తేదీని ఖరారు చేశారు.