జబర్దస్త్ లో పని చేసినవారు సంపాదించిన ఆస్తుల చిట్టా చెప్పిన ఆది,రాంప్రసాద్..!

ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షోకి ప్రేక్షకులలో ఎంతటి మంచి గుర్తింపు ఉందో అందరికీ తెలిసింది. ఈ జబర్దస్త్ షో ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చి వారిని ఆర్థికంగా నిలబెట్టింది. ఇలాంటి ఒక గొప్ప షో గురించి ఇటీవల కిర్రాక్ ఆర్పి చేసిన వ్యాఖ్యలు ఎప్పుడు ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. జబర్దస్త్ లో పనిచేసేవారిని అక్కడే యాజమాన్యం వారు బానిసల్లా చూస్తారని సరైన తిండి కూడా పెట్టరు అంటూ వ్యాఖ్యానించాడు. అంతే కాకుండా జబర్దస్త్ ప్రొడ్యూసర్ శ్యాంప్రసాద్ రెడ్డి గురించి కూడా ఆర్పి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆర్పీ చేసిన వ్యాఖ్యలు చర్చంశనీయంగ మారాయి.

అయితే జబర్దస్త్ గురించి ఆర్పీ చేసిన వ్యాఖ్యలను జబర్దస్త్ కమెడియన్లు ఖండిస్తున్నారు. ఈ క్రమంలో హైపర్ ఆది రాంప్రసాద్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని జబర్దస్త్ షో గురించి యాజమాన్యం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సమయానికి తిండి తినలేని పరిస్థితిలో ఉన్న ఎంతోమందికి జబర్దస్త్ జీవితాన్ని ఇచ్చింది. గతంలో కిర్రాక్ ఆర్పి కూడా జబర్దస్త్ నాకు ఒక అమ్మ లాంటిది అని వ్యాఖ్యానించాడు అంటూ దానికి సంబంధించిన వీడియో కూడా చూపించారు. ప్రస్తుతం ఆర్పి జబర్దస్త్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు ఆర్పి ఇలా ఎందుకు మాట్లాడాడు అర్థం కావటం లేదు అంటూ అది చెప్పుకొచ్చాడు.

జబర్దస్త్ లో పనిచేసిన అందరూ ఇప్పుడు ఆర్థికంగా కూడా బాగా నిలదొక్కుకున్నారు అంటూ ఆది చెప్పుకొచ్చాడు. జబర్దస్త్ కి రాకముందు 20 లక్షల అప్పు తీర్చడానికి ఉన్న మూడు ఎకరాలు అమ్ముకున్న ఆది జబర్దస్త్ లో పనిచేసిన తర్వాత అదే ఊర్లో ఇప్పుడు 16 ఎకరాలు కొన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా జబర్దస్త్ ద్వారా వచ్చిన ఆదాయం వల్ల రాంప్రసాద్ కూడా వైజాగ్ లో ఒక ఇంటిని హైదరాబాద్ లో ఒక ఇంటిని కొనుగోలు చేసినట్టు వెల్లడించాడు. సుధీర్, రష్మీ, గెటప్ శ్రీను వంటి వారు అందరూ కూడా జబర్దస్త్ ద్వారా వచ్చిన ఆదాయంతో సొంత ఇంటిని కొనుక్కున్నారు అంటూ రాంప్రసాద్ చెప్పుకొచ్చాడు. రష్మీ సొంత ఇంటిని నిర్మించుకోవడానికి అప్పు కావలసి వస్తే మల్లెమాల ప్రొడక్షన్ ని షూరిటీగా పెట్టి శ్యాం ప్రసాద్ రెడ్డి గారు అప్పు ఇప్పించారని రాంప్రసాద్ వెల్లడించాడు. ఆర్పీ ఒక్కడు ఇల్లు కొనుక్కోకపోతే జబర్దస్త్ నుండి ఎవరికి మంచి జరగలేదని అర్థమా అంటూ ప్రశ్నించాడు.