పండంటి ఆడ బిడ్డకి జన్మనిచ్చి తల్లిగా ప్రమోషన్ పొందిన నటి ప్రణీత!

హీరోయిన్ ప్రణీత శుభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.” ఏం పిల్లో ఏం పిల్లడు ” సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన వెనుక తన అందం అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తెలుగు, కన్నడ భాషలలో పలు సినిమాలలో నటించిన ప్రణీత అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించింది. ఈ సినిమా ద్వారా ప్రణీత పాపులారిటీ మరింత పెరిగింది. హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో ప్రణీత వివాహం జరిగింది. కరోనా సమయంలో రహస్యంగా వ్యాపారవేత్త నితిన్‌ రాజును వివాహం చేసుకుంది . ప్రణీత సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉండేది.

వివాహం జరిగిన తర్వాత అడపాదడపా సినిమాల్లో నటించిన ప్రణీత కొంతకాలం తర్వాత సినిమాలకు విరామం వచ్చింది. తన భర్త పుట్టినరోజు సందర్భంగా తను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని అధికారికంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేసింది. అప్పటి నుండి బేబీ బంప్ తో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది. ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో ప్రణీత చేసిన డాన్స్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇటీవల ప్రణీత సోషల్ మీడియాలో బేబీ బంప్ తో ఉన్న కొన్ని ఫోటోలు షేర్ చేసి.. డెలివరీ సమయం దగ్గరపడుతోంది అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

తాజాగా ప్రణీత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ప్రణీత ట్విట్టర్ వేదికగా తెలియచేసింది. ఈ సందర్భంగా తన కూతురితో ఉన్న ఫోటో ట్విట్టర్లో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. పాప పుట్టిన సమయం నుండి అంతా ఒక కలలా ఉంది. ఈ సమయంలో గైనకాలజిస్ట్ అయిన తల్లీ ఉండటం నాకు చాలా అదృష్టం. ఈ కష్టసమయంలో తనకి తోడుగా ఉండి ప్రసవం సజావుగా జరిగేలా చేసిన డాక్టర్లు అందరికీ నా కృతజ్ఞతలు అంటూ ప్రణీత పోస్టు చేసింది. ప్రణీత పోస్టు చూసిన సెలబ్రిటీలతో పాటు ఆమె అభిమానులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.