Pooja Hegde: రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన పూజా హెగ్డే ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Pooja Hegde: టాలీవుడ్ బుట్టబొమ్మ హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస సినిమా ఆఫర్ లను అందుకుంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా చక్రం తిప్పుతోంది. అంతేకాకుండా టాలీవుడ్ లో హీరోయిన్స్ లో ఎక్కువగా బిజీ గా ఉండే హీరోయిన్ ఎవరంటే పూజా హెగ్డే మాత్రమే. అలాగే ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే, మరొక వైపు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటుంది. పూజా హెగ్డే తో ఫోన్ లో మాట్లాడాలి అన్నా కూడా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే అంటే ఆమె ఎంత బిజీగా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు.

గత ఏడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో సూపర్ హిట్ టాక్ ను ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ప్రభాస్ సరసన రాధేశ్యామ్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పాటికి ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా మహమ్మారి వల్ల ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. అలాగే ఆచార్య సినిమాలో రామ్ చరణ్ సరసన నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా కరోనా వల్ల వాయిదా పడింది. ప్రస్తుతం కాస్త విరామ సమయం దొరకడంతో పూజా హెగ్డే తన కుటుంబంతో కలసి ఎంజాయ్ చేస్తోందట.

స్టార్ హీరోయిన్ గా వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ అదే రేంజ్ లో పారితోషికం కూడా అందుకుంటోంది. ఇప్పటికే పూజా హెగ్డే రెమ్యూనరేషన్ కు సంబంధించి ఎన్నో రకాల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. పూజా హెగ్డే పారితోషికం విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదని, అంతేకాకుండా వరుసగా సినిమాలు సక్సెస్ అవుతుండడంతో ఈ ముద్దుగుమ్మ అందనంత స్థాయికి ఎదుగుతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఒక సినిమాకు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల పారితోషికాన్ని డిమాండ్ చేస్తోందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.