బాలీవుడ్ నటి కృతిసనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “వన్ నేనొక్కడినే” సినిమాలో మహేష్ బాబుకి జోడిగా నటించి ఈ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ సినిమా తర్వాత కృతిసనన్ తెలుగులో సినిమాలు చేసినప్పటికీ బాలీవుడ్ లో మాత్రం అగ్రహీరోలతో వరుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. బాలీవుడ్లో టాప్ హీరోల సరసన ఎన్నో సినిమాలలో నటించిన కృతి సనన్ తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
తాజాగా కృతిసనన్ నటించిన “మిమి” సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలు కృతిసనన్ వైవిధ్యమైన పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో కృతి సనన్ డబ్బు కోసం సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చే తల్లి పాత్రలో నటించింది. ఈ సినిమాలో కృతి సనన్ నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. అంతేకాకుండా 2022 ఐఫా వేడుకలలో పాల్గొని ఈ సినిమాలో తన నటనకి ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. మొదటిసారి ఐఫా అవార్డు అందుకోవటంతో కృతి సనన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఐఫా అవార్డు అందుకున్న తర్వాత కృతి సనన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నా నటన ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా జ్యూరీ సభ్యులను గెలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నా నటనకి తొలిసారి ఐఫా అవార్డు లభించడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా కృతిసనన్ ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో నటిస్తోంది. ఇటీవల కృతి సనన్ ఈ సినిమా గురించి స్పందిస్తూ.. ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో నటిస్తున్న. ప్రభాస్తో సినిమా చేయటం చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలో ప్రభాస్ తో నటించిన ఈ సినిమా ఎప్పటికీ మర్చిపోలేను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కృతి సనన్ ఆదిపురుష్ సినిమాలో మాత్రమే కాకుండ టైగర్ ష్రాఫ్తో ‘గణపథ్’, కార్తీక్ ఆర్యన్ సరసన ‘షెహజాదా’ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
