నల్లగా ఉందని ఈ టాలీవుడ్ నటిని ఘోరంగా అవమానించారట.. ఏం జరిగిందంటే?

తెలుగులో తక్కువ సినిమాలే చేసినా బోల్డ్ రోల్స్ ద్వారా, రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో నటించడం ద్వారా జయవాణి పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. తనకు విలన్ పాత్రలు ఎక్కువగా వచ్చాయని జయవాణి కామెంట్లు చేశారు. తాను సీరియళ్లకు ఓకే చెప్పి ఉంటే మరింత బిజీ అయ్యేదానినని ఆమె చెప్పుకొచ్చారు. సినిమాలలో పురుషులకు ఎక్కువగా విలన్ రోల్స్ వస్తాయని ఆమె చెప్పుకొచ్చారు.

అన్ని మూవీస్ లో లేడీ విలన్ రోల్స్ ఉండవు కాబట్టి తనకు ఆఫర్లు తక్కువయ్యాయని ఆమె చెప్పుకొచ్చారు. ఒకే తరహా పాత్రలలో నటించడం తనకు నచ్చదని ఆమె కామెంట్లు చేశారు. నేను సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి నవరసాలు చేశానని దర్శకులకు తాను వైట్ పేపర్ లా అన్ని పాత్రలు చేయగలనని ప్రూవ్ చేసుకున్నానని ఆమె తెలిపారు. తాను ప్రూవ్ చేసుకున్నాను కాబట్టి బోల్డ్ రోల్స్ చేయాల్సిన అవసరం లేదని ఆమె కామెంట్లు చేశారు.

చిన్నప్పటి నుంచి నాకు ఇండస్ట్రీ అంటేనే ఇష్టమని ఆమె వెల్లడించారు. తాను భాషతో సంబంధం లేకుండా తాను సినిమాలు చూస్తానని ఆమె తెలిపారు. డాడీని ఏం అడిగితే అది వెంటనే కొనిచ్చేవారని ఆమె చెప్పుకొచ్చారు. తాను నల్లగా ఉండటం వల్ల కెరీర్ తొలినాళ్లలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నానని ఆమె కామెంట్లు చేశారు. ఈ బాధలు షేర్ చేసుకునేవి కావని ఆమె కామెంట్లు చేశారు.

నన్ను నేను మార్చుకుని కెరీర్ ను కొనసాగించానని ఆమె చెప్పుకొచ్చారు. నాకు నేను ఓన్ గా మేకప్ ను నేర్చుకున్నానని జయవాణి అన్నారు. మేకప్ మేన్ ఈశ్వర్ నుంచి తాను సెలక్షన్స్ కు కూడా మేకప్ తో వెళ్లేదానినని ఆమె వెల్లడించారు. అలా తాను పాత్రలను సంపాదించుకున్నానని ఆమె కామెంట్లు చేశారు. విక్రమార్కుడు సినిమాలో పాత్ర వల్ల తనకు విలన్ రోల్స్ పెరిగాయని ఆమె తెలిపారు.